ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

877
Shad Nagar
- Advertisement -

ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ (తహసీల్దార్) 14 రోజుల రిమాండ్ విధించారు. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దారు పాండు నాయక్ ఎదుట ప్రియాంక హత్యకేసు నిందితులను పోలీసులు హాజరుపరిచారు. పాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వెనక దారి నుంచి మెజిస్ట్రేట్‌ను పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. దీంతో, మేజిస్ట్రేట్ ను పోలీస్ స్టేషన్ కే తీసుకొచ్చారు.

కేసును విచారించిన మేజిస్ట్రేట్ నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. నిందితులకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, నిందితులను చెర్లపల్లి సెంట్రల్  జైలుకు పోలీసులు తరలించనున్నారు. భారీ బందోబస్తు నడుమ నిందితులను జైలుకు తరలించారు.

- Advertisement -