గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ములుగు జర్నలిస్టులు..

295
Mulugu Journalists Planted Saplings
- Advertisement -

ములుగు జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ములుగు జిల్లా జర్నలిస్ట్ లు మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జడ్పిటిసి సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, జడ్పీ సీఈవో పారిజాతం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ములుగు జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.

Mulugu Journalists Planted Saplings has accepted the Green Challenge thrown at him by TRS MP J Santosh Kumar. On Monday..

- Advertisement -