రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటడం తప్పనిసరి అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మరి కొందరికి ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. 1) రైల్వేస్ ఎస్పీ అనురాధ 2) ములుగు ఏ ఎస్ పి శ్రీ సాయి చైతన్య 3)ఏటూరునాగారం ఏఎస్పీ శరత్ చంద్రని గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ వై సతీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
As part of the Green Challenge programme taken up by MP Santosh Kumar, Mulugu district SP Sangram Singh G Patil Accepted the challenge..