రాహుల్ గాంధీకి చేరిన గ్రీన్ ఛాలెంజ్

390
Green Challeange Rahul Gandhi
- Advertisement -

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతుంది. పచ్చదనం పెంపే లక్ష్యంగా మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ ద్వారా, వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, సుప్రియ సూలే నుంచి రాహుల్ గాంధీ వరకు చేరింది.గ్రీన్ ఛాలెంజ్ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా మరోసారి మొక్కనాటిన ఎం.పీ సంతోష్ కుమార్, ఇంకో నలుగురికి మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు.

వైస్సార్ సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అఖిల్ అక్కినేని, జిఎమ్మార్ అధినేత మల్లికార్జున్ రావు ను మొక్కలు నాటాల్సిందిగా సంతోష్ కుమార్ ట్వీట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. అఖిల్, మిధున్ రెడ్డి, మల్లిఖార్జున రావులు వెంటనే దీనిని అంగీకరిస్తూ టిట్టర్ లో పోస్టు పెట్టారు. మల్లిఖార్జున రావు స్వయంగా మొక్కను నాటి హరితహారంపై తన ఆకాంక్షను వెల్లడించారు.

అమెరికా పర్యటనలో ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని, తిరిగిరాగానే మొక్కలు నాటుతానంటూ, తన తరుపున మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో మహారాష్టకు చెందిన ఎన్సీపీ ఎం.పీ సుప్రియా సూలే కూడా ఉన్నారు. మిధున్ రెడ్డి ఛాలెంజ్ ను స్వీకరించిన సుప్రియా ఇవాళ తన నియోజకవర్గం పరిధిలోని జిల్లా పరిషత్ స్కూల్లో మొక్కలు నాటారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తాను నామినేట్ చేస్తున్నట్లు సుప్రియ ట్వీట్ చేశారు.

- Advertisement -