సూర్యపేటలో ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు..

531
mp santhosh
- Advertisement -

మహాశివరాత్రి సందర్భంగా మేల్లచెరువు లోని స్వయంభూ లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,ఎంపీ లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యేలు సైదిరెడ్డి,చిరుమర్తి లింగయ్య,బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు,శివరాత్రి ప్రభలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి…రాష్ట్ర ప్రజలకు అందరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివుడి ఆశీస్సులతో ,సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ పాడి పంటలతో , సుభిక్షంగా ఉండాలని మేల్ల చెరువు శివయ్యను వేడుకున్నానని తెలిపారు. తెలంగాణ అంటేనే భిన్న సాంప్రదాయాలకు,సాంస్కృతి లకు పుట్టినిల్లని..హుజుర్‌నగర్‌ ప్రాంతంలో శివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించుకుంటారని చెప్పారు.

రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మేల్ల చెరువు స్వయంభూ లింగేశ్వర స్వామిని మొక్కుకున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఉన్నట్లుగానే సంతోషంగా, గొప్పగా ఉండాలని దేవుడిని కోరుకున్నానని చెప్పారు.

- Advertisement -