వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంపీ సంతోష్‌..

528
mp santosh kumar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ రోజు శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అలయాన్ని సందర్శించారు. ఆయన కాలినడకన తిరుమల కు చేరుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు.

ఎంపీ సంతోష్‌ శ్రీవారిని దర్శించుకొని చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఎంపీతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాష్ట్ర చైర్మన్ లు కె. వాసుదేవారెడ్డి, నాగుర్ల వెంకన్నలు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. ఆ దేవదేవుడు శ్రీవారి ఆశీస్సులు అందరి పైనా ఉండాలని రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎంపీ, ఎమ్మెల్సీలు కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -