మేడిగడ్డ వద్ద మంత్రి ఈటెలతో సెల్ఫీ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్

727
mp Santhosh Kumar Selfie With Etela
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచి ఉండటంతో రివర్ బేసిన్ ను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కలిసి రెండు హెలికాప్టర్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.

Mp Santhosh Kumar

ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పలువురు అధికారులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా హెలికాప్టర్ లో వచ్చిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు స్వాగతం పలికారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు అధికారులు.

అనంతరం మేడిగడ్డ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్ తో సెల్ఫీ తీసుకున్నారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. అనంతరం కాసేపు అక్కడ సరదాగా ముచ్చటించారు.

- Advertisement -