గ్రీన్ ఛాలెంజ్‌…డీసీపీపై ఎంపీ సంతోష్ ప్రశంసలు

545
dcp
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు శంషాబాద్ డీసీపీ ఎం. ప్రకాష్ రెడ్డి. తన కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన ఆయన ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేగాదు మరో ముగ్గురుని గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగమైనందుకు ప్రకాష్ రెడ్డిని అభినందించారు ఎంపీ సంతోష్ కుమార్‌. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా విషెస్ చెప్పిన సంతోష్…మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కూడా చెట్లు నాటాలని సూచించారు.

green challenge

- Advertisement -