- Advertisement -
సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం ప్రతి రోజు కొనసాగుతోంది. వలస కూలీల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో 6వ రోజు కూడా సుమారు తొంభై మందికి అన్నదాన చెయ్యడం జరిగింది. ఇది మాజీ ఎంపీటీసీ బొల్లావేని భానుశ్రీ-తిరుపతి సహకారంతో అన్నదానం చెయ్యడం జరిగింది.
అన్నదాత సుఖీభవో అని అన్నారు పెద్దలు. ఇలాంటి సమయంలోనే గొప్పవాళ్ళు ఎవరో తెలుస్తోంది. సాధ్యమైనన్నీ ఎక్కువ రోజులు పెడతామని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒద్దెల మహేందర్, నాగుల నాగరాజు, సారంపెళ్లి రవి, కమల్, ఆకుల కర్ణకర్, ఆకుల రాజిరెడ్డి, గుండా సాహెబు కార్మికులకు భోజనాలు వడ్డించారు.
- Advertisement -