ఓటు హక్కు వినియోగించుకోండి:ఎంపీలు కవిత,సంతోష్ కుమార్

274
mp santhoh kavitha
- Advertisement -

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ కవిత. తన మిత్రులతో కలిసి కొదురుపాక ప్రాధమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఓటు వేయడానికి విచ్చేసిన ప్రజలను ఆప్యాయతగా పలకరించారు.ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

santhosh trs

నిజామాబాద్ పోతంగల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ ప్రజలందరూ స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఏ పార్టీకి ఓటు వేస్తామన్నదానికన్నా ముఖ్యంగా ఓటు వేయడం అన్నది ముఖ్యమన్నారు.

మెదక్ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారంలో సతీమణి పెరిగే పుష్పామ్మతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ బంగ్లా సమీపంలోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -