రాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారింది

436
Badugula lingaiha Yadav
- Advertisement -

రైతు బాంధవుడు , ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ లో వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్. నకిరేకల్ ఎమ్మెల్యే Mla చిరుమర్తి లింగయ్య తో కలిసి మూసి ప్రాజెక్ట్ కుడి ఎడమ, కాల్వలకు సాగు నీటిని విడుదల చేసారు ఎంపి లింగయ్య యాదవ్.

ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మూసి ప్రాజెక్ట్ చరిత్రలో మొట్టమొదటి సారి వరుసగా రెండు పంటలకు నిరి అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని అన్నారు. మూసి ప్రాజెక్ట్ గేట్ మరమ్మతులు లకు గురైతే మంత్రి జగదీష్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకుపోయి కొన్ని గంటల్లోనే దగ్గరుండి మరమ్మతులు లను పూర్తి చేపించారన్నారు. ఖాళీ అయిన మూసి డ్యామ్ ను SLBC, SRSP నీళ్లతో నింపి ముందస్తుగానే రబి పంటలకు నీటిని విడుదల చేయడం అద్భుతమని అన్నారు.

- Advertisement -