- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు సినీ నటుడు,వైసీపీ నేత మోహన్ బాబు. కుటుంబ సభ్యులు విష్ణు,లక్ష్మీ,విరోనికాలతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన మోహన్ బాబు…దాదాపు 45 నిమిషాల పాటు ముచ్చటించారు.
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోహన్బాబు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షాతోనూ సమావేశంకానున్నారు.
మోహన్బాబు కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మోడీతో భేటీపై మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. ప్రధానిని కలిశామని.. ఆయన విజన్ను దేశం మొత్తం క్లియర్గా వినిందన్నారు.
- Advertisement -