కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి తోడు దొంగలు..

536
mlc palla
- Advertisement -

కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి తోడు దొంగలని ఆరోపించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. హుజుర్‌నగర్‌లో పార్టీ కార్యాలయంలో ఎంపీ లింగయ్య యాదవ్,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి ఓ పిట్టల దొరని ఎద్దేవా చేశారు. జైలు చిప్ప కూడుకు అలవాటు పడ్డ రేవంత్ రెడ్డి మళ్ళీ జైలుకు పోవడం ఖాయం అన్నారు.

బుడ్ధర్ ఖాన్ లా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పెద్ద నాయకున్నీ అని భ్రమ పడుతున్నడు…..పగటికలలు కంటున్నడని మండిపడ్డారు. హుజుర్‌నగర్ లో ఉత్తమ్ పద్మావతికి టికెట్ వద్దన్న రేవంత్ ఇవాళ ఎన్నికల ప్రచారంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు.

కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలి….తప్ప తాగి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. నల్గొండలో ఓడ గొట్టి బుద్ది చెప్పినా కోమటిరెడ్డి కి ఇంకా గుణపాఠం రాలేదు………కోమటిరెడ్డిని పిచ్చసూపత్రి లో చేరిపిస్తాం అన్నారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోక పోతే తెలంగాణ ప్రజలు తరిమికొడుతారని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మంత్రి పదవిని పొందిన ఉత్తమ్ కి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కోమటిరెడ్డి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్నారు.హుజుర్‌నగర్ లో కాంగ్రెస్ తోడేలు గుంపులు,, పగటి వేశగాళ్ళు,వృద్ధ జంబుకాలు,గజ దొంగల గుంపు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం టీఆర్ఎస్‌దే అన్నారు.

కోమటిరెడ్డి , రేవంత్ రెడ్డి …ఉత్తమ్ కి మద్దతుగా ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.దొంగలు దొంగలు ఒక్కటయ్యారు……హుజుర్నగర్ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్ దొంగలు దోచుకుంటారన్నారు. టీఆర్ఎస్‌కు ఓటేసి అభివృద్ధి కి పట్టం కట్టాలన్నారు.

రేవంత్ రెడ్డి హుజుర్‌నగర్ వచ్చి నీతులు మాట్లాడుతున్నాడు…..ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గురిగింజ లాగా ఫోజులు కొడుతున్నడు…… నోటికి వచ్చినట్లు మాట్లాడితే రేవంత్ నాలుక కోస్తాం అన్నారు. తెలంగాణ నుంచి రేవంత్‌ను తన్ని తరిమెసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

- Advertisement -