గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కర్నె

357
Karne Prabhakar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఈగ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. తన ఇంటి ఆవరణలో మొక్కులు నాటారు.

ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. అనంతరం ఈ గ్రీన్ ఛాలెంజ్ ను మరో ముగ్గురికి సవాల్ గా విసిరారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కు ఈ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కు కారణమైన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -