- Advertisement -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ని కలిశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు ఉన్నారు.
ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవకే తన ఎమ్మెల్సీ పదవిని వినియోగిస్తాన్నారు. వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదన్నారు గుత్తా.
- Advertisement -