కోమటిరెడ్డికి మతి భ్రమించింది: ఎమ్మెల్యే వివేక్‌

626
vivek
- Advertisement -

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ మండిపడ్డారు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన వివేక్‌..శంభీపూర్ రాజుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమేనని చెప్పారు. రాజు తన సొంత ఊర్లో ఇళ్లు కట్టుకుంటే కోమటిరెడ్డికి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.

బలహీన వర్గాలకు చెందిన వారు ఎదిగితే కోమటి రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఎక్కడో బ్రాహ్మణవేల్లం లో పుట్టిన కోమటి రెడ్డి లోటస్ పాండ్ లో ఇల్లు కట్టుకుంటే మేము తప్పుబట్టామా ?…మా ఎమ్మెల్సీ ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ రోడ్ల పై కి నీళ్లు వస్తున్నాయని కోమటి రెడ్డి మాట్లాడటం అర్ధరహితమన్నారు.

శంభీ పూర్ రాజు పై కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తామని…కోమటి రెడ్డి ని రోడ్డుకు ఈడుస్తామన్నారు. కేటీఆర్‌ అండతో కబ్జాలు చేస్తున్నామని కోమటి రెడ్డి చెబుతున్నారు…..ఆధారాలుంటే నిరూపించాలి …లేదంటే ముక్కు నేలకు రాయాలన్నారు. హైదరాబాద్ లో కరెంటు ,తాగునీటి సమస్య పరిష్కరించామని చెప్పిన వివేక్…శాంతి భద్రతల ను పరిరక్షించాం ,కోమటి రెడ్డి అసత్య ఆరోపణలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -