ఎంపీ ధర్మపురిపై చీటింగ్ కేసు పెట్టాలి- ఎమ్మెల్యే

639
Jagtial MLA
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తామని బాండ్ రాసిచ్చి రైతులను తప్పుదోవ పట్టించారని ఆయన ఎద్దేవ చేశారు. ఎంపీ ధర్మపురిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి. పసుపు బోర్డు తెస్తామని రైతులను మభ్యపెట్టి అరవింద్ గెలిచారు. కానీ ఇప్పడు రైతుల మదిలో మోసగాడిలా మారారు. ఎంపీ అరవింద్ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్‌ చేశారు.

మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు విషయంలో రాజీ లేని పోరాటం చేశారు. నాణ్యత,మార్కెటింగ్,ఉత్పత్తి విషయంలో రివ్యూలు నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపుపై స్టడీ చేసిన ఘనత మాజీ ఎంపీ కవితది. అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -