రజనీకాంత్‌ని కలిసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి…

517
pilot rohith reddy
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్‌ని కలిశారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి. బుధవారం చెన్నైలోని రజినీ నివాసానికి కుటుంబ సమేతంగా చేరుకున్న రోహిత్‌రెడ్డి…. పుష్పగుచ్ఛం అందించి రజనీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటీ తమ వ్యక్తిగతమని …సూపర్‌స్టార్‌కు కోట్లలో అభిమానులు ఉన్నారని చెప్పారు. ఎన్నుకున్న ప్రజలకు సేవచేయాలని రజినీ సూచించారని తెలిపారు రోహిత్.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన రోహిత్‌రెడ్డి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరారు. యంగ్ లీడర్స్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న రోహిత్ రెడ్డి….గతంలో పలుమార్లు రజనీకాంత్‌ను కలిశారు.

- Advertisement -