సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలి-హరీష్‌రావు

261
MLA Harish Rao
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సిద్ధిపేట పట్టణ నాయకులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. పట్టణంలో సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని ఆయన నాయకులను ఆదేశించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని వార్డులకు ఇంచార్జిలను నియమించారు హరీష్ రావు. పట్టణం పరిదిలో 20 వేల సభ్యత్వాలు సేకరించాలని లక్ష్య నిర్దేశం చేశారు.

పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులకు రెండులక్షల బీమా సదుపాయం ఉంటుందని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశేష ఆదరణ ఉందని..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హరీష్‌ రావు తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం కోసం ప్రజలు స్వచ్చందంగా ముందుకువస్తున్నారు. నాయకులు సమన్వయం చేయాలని హరీష్ రావు సూచించారు.

- Advertisement -