ఎమ్మెల్యే కిషోర్ పాస్టర్లకు నిత్యవసరాల పంపిణీ..

262
MLA Kishore
- Advertisement -

సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలో 300 మంది పాస్టర్లకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో బియ్యం,నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గాదరి కిషోర్ అన్నారు.

MLA Gadari Kishore

లాక్ డౌన్ సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అన్నారు.. కాళేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో కంటే నాలుగు రెట్లు పంట దిగుబడులు అధికంగా వచ్చాయని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.కరోనా కష్టకాలంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సంస్థ పాస్టర్లకు అండగా ఉండడం అభినందనీయమని ఎమ్మెల్యే కిషోర్ అన్నారు.

- Advertisement -