మొక్కలు నాటిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

443
lingayya
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అనూష్యమైన స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

ఈసందర్భంగా నార్కట్ పట్టి పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసిరారు. విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య లకు గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.

- Advertisement -