- Advertisement -
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు పాటించాలి అంటూ ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కే టి రామారావుకి నా అభినందనలు. ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి నేను ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటుగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంటే సీజన్ లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చని..పరిశుభ్రత తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఎమ్మెల్యే తెలిపారు.
- Advertisement -