ఈనెల 17న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాలను ప్రారంభించనున్న సీఎం..

298
mlaquarters
- Advertisement -

హైదరాబాద్ లోని హైదర్ గూడలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీల కోసం కొత్తగా నిర్మించిన నివాస గృహాలను ఈనెల 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 17న ఏరువాకపౌర్ణమి పురస్కరించుకుని మంచి రోజు కావడంతో నివాస గృహాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు సీఎం  .

ఈ నివాస గృహాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్‌ గృహవాస్తు పూజలు చేయనున్నారు.

మొత్తం 4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో 12 అంతస్తులతో 120 క్వార్టర్లను నిర్మించారు. 2100 చదరపు అడుగుల ప్రతి క్వార్టర్‌లో 3 బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది, 36 మంది సిబ్బందికి కూడా గదులను కేటాయించనున్నారు. ఈ ప్రాంగణంలోనే బ్యాంకు, క్లబ్‌ హౌజ్‌, సూపర్‌ మార్కెట్‌ నిర్మించారు. 240 వాహనాల పార్కింగ్‌కు సదుపాయం కల్పించారు.

- Advertisement -