ఇంటింటికీ నల్లా కనెక్షన్‌..ఘనత సీఎం కేసీఆర్‌దే

523
medchal mallareddy
- Advertisement -

ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌లో రూ.4 కోట్ల 36 లక్షలతో నిర్మించిన 30 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన మంచినీటి వాటర్ ట్యాంకును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి …ఈ మంచినీటి వాటర్ ట్యాంక్ ద్వారా 196 కాలనీలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మేడ్చల్ నియోజకవర్గం లోని అత్యంత జనాభా కలిగిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషషన్‌కు అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఎంపీపీ ల పోరం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, ఎంపీపీ ల పోరం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ స్ధానిక టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mission Bhagiratha credit goes to CM KCR says Minister Chamakura Mallareddy..Mission Bhagiratha credit goes to CM KCR says Minister Chamakura Mallareddy..

- Advertisement -