ఓటేసిన పోచారం,ఎర్రబెల్లి,ఇంద్రకరణ్

396
pocharam vote
- Advertisement -

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ఓటర్లతో పాటు ఎమ్మెల్యేలు,మంత్రులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ మండలం పోచారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన స్వగ్రామం నిర్మల్ జిల్లాలోని ఎల్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేయగా వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ,సిద్దిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు, నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, నారాయణపేట్ జిల్లా శేరి వేంకటాపుర్‌లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా వల్లూర్ గ్రామంలో ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. అబ్రహం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

allu arjun cm kcr vote

- Advertisement -