సంతన్న ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్రశాంత్ రెడ్డి

738
vemula prashanth reddy
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ ఎంపీ సంతోష్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించారు రోడ్డు రవాణా మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మినిస్టర్ క్వాటర్స్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తాకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

ఇప్పటికే సంతోష్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించారు దర్శకుడు శంకర్‌,హీరో అఖిల్,జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లిఖార్జున రావు. దర్శకుడు శంకర్‌…డా.రాజేంద్రప్రసాద్ , జీవిత రాజశేఖర్ ఎస్వీ బిసి చైర్మన్ పృద్వికి ఛాలెంజ్‌ విసిరారు.

prashanth

హీరో అఖిల్ .. తన సోదరుడు నాగచైతన్య, మెగా హీరో వరుణ్ తేజ్‌ను గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. జీఎంఆర్‌ అధినేత గ్రంధి మల్లికార్జున రావు సైతం గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తన నివాసంలో మొక్క నాటారు.

- Advertisement -