బాక్సర్ నిఖత్ ను ఒలంపిక్స్ కు ఎంపిక చేయాలి

451
Boxer Minister Srinivas Goud
- Advertisement -

బాక్సింగ్ లో అద్భుతమైన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో కనబరుస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్. నిఖత్ ను టోక్యో – 2020 ఒలింపిక్స్ కు 51 కేజీల విభాగంలో ఎంపిక చేయాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు , స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాల్యం నుంచే బాక్సింగ్ క్రీడా లో మంచి ప్రతిభను కనబరుస్తూ అంచలంచలుగా రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఛాంపియన్స్ షిప్ లలో బంగారు పతకాలు సాధించి దేశానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుక వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.

మంచి ప్రతిభను కలిగిన నిఖత్ జరీన్ ను 2020 లో టోక్యో లో జరిగే ఒలింపిక్స్ కు ఎంపిక చేస్తే ఒలంపిక్ పథకం ను సాధించే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిఖత్ జరీన్ ఒలింపిక్స్ ఎంపిక పై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుక వెళ్తామని నిఖత్ జరీన్ తండ్రి శ్రీ. జామీల్ అహ్మద్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు పాల్గొన్నారు.

- Advertisement -