పాలమూరు ప్రగతికే ఓటర్ల పట్టం:శ్రీనివాస్ గౌడ్

393
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ప్రాణవాయువు లాంటిదని ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు…

ఎవరైతే పట్టణ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారో అలాంటి వారికే ఓటు వేయాలని ఆయన సూచించారు.పట్టణ ఓటర్లు విజ్ఞులనీ ఎవరికి ఓటేస్తే పట్టణం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది వారికి బాగా తెలుసునని అలాంటి వారికే పట్టణ ఓటర్లు పట్టం కడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

పోలింగ్ ఇప్పటికే సంతృప్తికరంగా నమోదు కావడం ఓటర్లు మరింత స్ఫూర్తి వంతంగా పోలింగ్ బూతుల కు తరలి వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన మరోసారి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -