ఇస్టా కాంగ్రెస్‌పై మంత్రి నిరంజన్‌ రెడ్డి రివ్యూ

415
singireddy niranjanreddy
- Advertisement -

తొలిసారి ఆసియాలో అదీ భారతదేశంలో విత్తన కాంగ్రెస్ (ISTA – 2019) సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రతి ఒక్కరు పనిచేసి సదస్సు విజయవంతానికి కృషి చేయాలన్నారు. జూన్ 26 నుండి జులై 3 వరకు హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ విత్తన సదస్సుకు 70 దేశాల నుండి 800 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు.

సదస్సు విజయవంతం కోసం అధికారులతో సమీక్ష నిర్వహించిన నిరంజన్ రెడ్డి ఏర్పాట్లు రెండు , మూడు రోజులలో పూర్తికావాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని..- సదస్సులో భాగంగా 1500 మంది రైతులతో తెలంగాణ విత్తన రైతుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.

అంతర్జాతీయ విత్తన సదస్సులో దేశ, విదేశీ సంస్థల 65 స్టాళ్ల ఏర్పాటు చేయబోతున్నాయని విత్తన సంస్థలతో ఇస్టా ప్రతినిధుల ముఖాముఖి ఏర్పాటు ఉంటుందన్నారు. రవాణా, భోజన వసతులపై సూచనలు చేయడంతో పాటు విత్తన సాంకేతిక సమావేశాలు, విత్తన రైతుల సమావేశాలు, ఎగ్జిభిషన్లు, సదస్సుకు భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలపై అవగాహన నిర్వహించారు. ఆహ్వానంలో సకాలంలో అందజేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి , రాహుల్ బొజ్జ , తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ కేశవులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -