అగ్రిటెక్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి..

476
- Advertisement -

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న అగ్రిటెక్స్7వ ఎడిషన్ ఎగ్జిబిషన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.ఈ అగ్రిటెక్స్ 7వ ఎడిషన్ మూడు రోజుల పాటు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది.. ఇక్కడ వ్యవసాయము ,పాడి పరిశ్రమ ,ఉద్యాన,పుడ్ ప్రాసెసింగ్,ఆక్వా కల్చర్ ,అంతర్జాతీయ మహా ప్రదర్శన జరగనుంది.

niranjan reddy

ఈ ఎగ్జిబిషన్‌లో యూకే, ఇటలీ ,నెదర్లాండ్స్,ఆస్ట్రేలియా నుండి పెట్టుబడిదారులు మరియు ఏక్సిబిటర్లు సమావేశం కానున్నారు.వారు కష్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలు ,సంప్రదింపులు, జరపనునున్నారుపోటీ మార్కెట్‌కు తగిన వ్యూహ నిర్మాణ అవకాశాలు, సాంకేతిక అభివృద్ధిపై వివిధ దేశాల వ్యవసాయ నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు.

అధునాతన వ్యావసాయ అన్వేషణ ,పాడి ,పుడ్ ప్రాసెసింగ్ ,ఆక్వా కల్చర్ ,హార్టికల్చర్ ,విజ్ఞాన సదస్సు లపై సమాచార సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు మరియు శాస్త్రవేత్తలు తమ నైపుణ్యాన్ని ఇందులో పంచుకుంటారు అలాగే తాజా ఆవిష్కరణలపై చర్చిస్తారు.

- Advertisement -