సిరిసిల్ల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..

228
Minister KTR
- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చేపట్టిన బైక్ ర్యాలీలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ.. గత పాలకులు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చినరన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ చేనేత కార్మికులకు అండగా నిలబడిందన్నారు. మంత్రి కేటీఆర్‌కు మనమంతా అండగా నిలబడాలన్నారు. రవీందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందన్నారు.

కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపు అని బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కర్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ కార్యకర్తలకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -