- Advertisement -
కరోనా నియంత్రణ చర్యల్లో వలస కూలీలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకువస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు. తెలంగాణ వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.
తాజాగా ధర్మపురి నియోజకవర్గంలో వివిధ మండలా నుండి ముంబై రాష్ట్రానికి ఉపాధి కోసం వెళ్ళిన వారికి సహాయ సహాకారాలు అందజేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ . భోజన వసతి మరియు 1,18,000 ఆర్థిక సాయం అందించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ …..కొప్పులను అభినందించారు.
- Advertisement -