టీఆర్‌ఎస్‌ ఎంపీలతో మంత్రి కేటీఆర్‌ భేటీ..

299
ktr meets mps
- Advertisement -

పార్లమెంట్ లోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో టీఆర్‌ఎస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుండి వచ్చే నిధులు తీసుకురావడంలో ఎంపీలందరూ చొరవతీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ఎంపీలలో జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య, పోతుగంటి రాములు, బాండ ప్రకాష్,నమ నాగేశ్వర్ రావు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, రంజిత్‌లు ఉన్నారు.

trs mps

అందకుముందు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఫార్మా సిటీ సాధించిన ప్రగతిని మంత్రి కేటీఆర్ వివరించారు. అలాగే కేంద్రం నుండి మరింత సహాయ, సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Union Minister Prakash Javadekar

- Advertisement -