కొత్త పురపాలక చట్టంపై కేటీఆర్‌ సమీక్ష..

468
minister ktr
- Advertisement -

ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ,డిటిసిపి సంచాలకులు, జీహెచ్ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. పట్టణ ప్రణాలిక విభగంకు సంబంధించి కొత్త పురపాలక చట్టంలో తీసుకువచ్చిన మార్పులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ktr

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త చట్టంలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి వినూత్న మార్పులు తీసుకువచ్చాము. ఇబ్బందులు లేని సరళమైన విధానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండి సులభంగా సేవలు అందాలి. వీలైనంత వరకు ఎవరి ప్రమేయం లేకుండానే ప్రజలకు సేవలు అందేలా చూడాలి అని కేటీఆర్‌ అన్నారు.

అవసరమైన అనుమతులు మీ సేవా,మొబైల్ యాప్,వెబ్ సైట్, కియోస్ తదితర వేరువేరు రకల్లో పొందేలా చూడాలి. రాష్ట్రంలోని ప్రతి పురపాలికకు సమగ్ర మాస్టర్ ప్లాన్,క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ అమలు చెయ్యాలి. కొత్త చట్టానికి సంబంధించి అన్ని సందేహాల నివృత్తి కోసం కస్టమర్ కేర్ ఏర్పాటు చెయ్యాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు.

- Advertisement -