ఎలాంటి పరిస్థితుల్లో అయినా తెలంగాణ ప్రజలు ఎక్కడనుంచి సాయం కోసం అభ్యర్థించిన..వారికి చేదోడుగా నిలుస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్. ఓ నిరుపేద కుటుంబానికి మంత్రి కేటీఆర్ సాయం అందించారు. రాయికల్ మండలం భూపతిపూర్కు చెందిన భూపతి-ప్రశాంతి దంపతుల కవల పిల్లలు ఉన్నారు. తమ పిల్లలు అనార్యోగంతో బాధపడుతున్నారని, వైద్యానికి లక్షల్లో ఖర్చవుతున్నదని సాయం కోరుతూ ఇటీవల మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్కు సైతం ఫోన్ ద్వారా తమ దీనస్థితిని చెప్పుకోగా, ఎమ్మెల్యే ప్రత్యేకంగా కేటీఆర్తో మాట్లాడారు. వారి దీనగాథను విన్నమంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో రూ.2లక్షల ఎల్వోసీని ఇప్పించారు. అంతేకాకుండా చిన్నారులు చికిత్స తీసుకుంటున్నజిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు ఎమ్మెల్యే వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.