మొక్కలు నాటిన మంత్రి కొప్పుల ఈశ్వర్

440
Koppula Eshwer
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామ పర్యటనలో భాగంగా ఆరు మొక్కలను నాటారు మంత్రి కొప్పుల. ఈసందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్చందంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -