గడ్కరీని కలిసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి..

292
jagadish reddy
- Advertisement -

ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై చర్చించారు.

అనంతరం మీడియాతో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందజేసాం. గతంలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల కేటాయింపు అంశంలో అన్యాయం జరిగింది. ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో 3,150కిలో మీటర్ల జాతీయ రహదారులు కేటాయిస్తామని ప్రధాని మోదీ మాట ఇచ్చారని మంత్రి తెలిపారు. అందులో 600 కిలో మీటర్లకుపైనా నంబరింగ్ ఇవ్వలేదు. నంబరింగ్ ఇచ్చిన రహదారుల పనులు కూడా ప్రారంభించలేదు. కొత్తవాటికి నంబరింగ్ ఇచ్చి పనులు వేగవంతం చేయాలని కోరినమని జగదీష్‌రెడ్డి అన్నారు.

Gadkari

వర్షాల వల్ల రాష్ర్టంలోని జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.వాటన్నింటిని త్వరగా రిపేర్లు చేయాలని కోరినం.హైదరాబాద్ నుండి భూపాలపల్లి 163 జాతీయరహదారిలో రెండు చోట్ల అండర్ పాస్‌లు మంజూరు చేయాలని కోరినం. కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారి 167లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా అండర్ పాస్‌లు నిర్మాణం చేయాలని కోరినం. అలాగే చేవేళ్ల-బీజాపూర్ జాతీయరహదారి అంశాన్ని వేగవంతం చేయాలని కోరామని..హైదరాబాద్ చూట్టు రిజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని త్వరగా చేపట్టాలని కోరినం. అన్ని అంశాలపట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. గతంలో హామీ ఇచ్చిన జాతీయ రహదారుల నిర్మాణ అంశం పెండింగ్ లో ఉంది. రిజనల్ రింగ్ రోడ్డు అంశంలో రాష్ర్ట ప్రభుత్వం తరుపున 50 శాతం భరిస్తామని చెప్పినం. ఇందుకు నంబరింగ్ ఇచ్చి పనులు వేగవంతం చేయాలని కోరినమని నామా తెలిపారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వెళ్లే 63జాతీయ రహదారి వెళ్తోంది. ఇందులో మూడు చోట్ల ఫ్లైఓవర్లు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరినం.కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని బాల్క సుమన్‌ అన్నారు.

- Advertisement -