ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలుస్తోంది..

294
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నానాటికి పెరిగి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలుస్తోంది అని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ ప్రాంగణంలోని యస్ పిడియస్ఎల్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్ కో అండ్‌ జెన్ కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు యస్ పిడిసిఎల్ సియండి రఘుమారెడ్డి తోపాటు యన్‌పిడిసిఎల్ సియండి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Minister Jagadish Reddy

ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికి సరఫరాలో అంతరాయం కలుగకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించిన రోజు నుండి డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతుందన్నారు. కిందటి సంవత్సరం ఆగస్టు 30 నాటికి గరిష్టంగా 11,703 మేఘావాట్ల డిమాండ్ నమోదు అయిందని ఆయన తెలిపారు.

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు 11,500 మేఘావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయినప్పటికీ 13,000 మేఘావాట్ల డిమాండ్ వరకు పెరిగే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా సాంకేతికంగా ఆటంకాలు ఎదురు కాకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్‌ను అందించి తెలంగాణ రైతాంగంలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పడుతున్న శ్రమలో విద్యుత్ సిబ్బంది బాగాస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.

- Advertisement -