ఓటేసిన మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు

378
jagadishreddy
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 120మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రు నగర్‌లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్‌ బూత్‌లో మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

- Advertisement -