వచ్చే శివరాత్రికి మెదక్ కు కాళేశ్వరం నీళ్లు

387
Minister Harish Rao
- Advertisement -

వచ్చే శివరాత్రి వరకు మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. మహాశివరాత్రి జాతర సందర్భంగా . ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందన్నారు. కాళేశ్వరం పనులను సిఎం కెసిఆర్ యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయించి అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఏడు పాయలకు వచ్చే భక్తుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మెదక్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -