సీఎం కేసీఆర్, కేటీఆర్ కు అభినందనలు

394
harish
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు కనబరుస్తుంది. ఇప్పటికే మెజార్టీ మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు తెలిపారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు హరీష్‌రావు ట్వీట్‌ చేశారు.ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దేనని తెలంగాణ ప్రజలు మరోసారి రుజువుచేశారని అన్నారు.

ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని ఫలితాలు అందించారు. ఈ విజయానికి కష్టపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు మంత్రి హరీష్‌ రావు అభినందనలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్‌ సారధ్యంలోని ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీకే సాధ్యమని చాటిచెప్పిన తెలంగాణ ప్రజానీకానికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్‌రావు.

- Advertisement -