అందరికీ హ్యాపి న్యూ ఇయర్ః మంత్రి హరీశ్ రావు

394
Harish Rao new
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షాలు తెలిపారు ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ప్రతిఒక్కరు ముందుకు సాగాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2019 సంవత్సరలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని గుర్తు చేశారు.

ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని పురోభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుపుతామన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్ధులు నూతన లక్ష్యాలు పెట్టుకుని.. ఆలక్ష్యాలకు అనుగుణంగా కష్టపడాలని సూచించారు. 2019 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ…2020 లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని కోరుతూ…అందరికీ ” హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు.

- Advertisement -