రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు- హరీష్‌రావు

514
harish rao
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు.

ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా బట్టలు పంపిణీ చేసిందని తెలిపారు. యేసు ప్రభు దీవెనలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో వేడుకగా జరుపుకోవాలని మంత్రి హరీష్‌ కోరుకున్నారు.

- Advertisement -