- Advertisement -
నేడు ఢిల్లీలో 15 వ ఆర్థిక సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్తో మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు భేటీ అయ్యారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్రం నుండి నిధుల శాతం పెంపు, ఋణపరిమితి పెంపు, మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకు నిర్వహణ నిధులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖను చైర్మన్ నందకిశోర్ సింగ్కు హరీష్ రావు అందజేశారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ భగీరథకు 19వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు మంత్రి హరీష్ రావు.
- Advertisement -