‘డీఆర్‌డీఓ’కు ధన్యవాదాలు: మంత్రి ఈటెల

195
etela
- Advertisement -

కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఊపిరితిత్తుల మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది.అన్నిటికంటే ముందు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయని. ఇలాంటి పేషెంట్లకు అత్యవసర సమయంలో వెంటిలేటర్స్ సహాయం అవసరం అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.అందుకోసమే ఎక్కువ వెంటిలేటర్స్ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని..మా విజ్ఞప్తిని మన్నించి వెంటిలేటర్స్ తయారు చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చిన డీఆర్‌డీఓ కు ధన్యవాదములు తెలిపారు మంత్రి.

అలాగే వివిధ హాస్పిటల్స్‌లో చిన్న చిన్న సమస్యలతో పక్కన పడేసిన వెంటిలేటర్స్‌ను ఇప్పటికే రిపేర్ చేయించి వినియోగిస్తున్నామని.. అదే విధంగా కొత్త వెంటిలేటర్స్ కోసం కూడా ఆర్డర్ ఇచ్చామన్నారు. అయితే వెయ్యి వెంటిలేటర్స్ ఇవ్వాలని మొదటిరోజే కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ని కోరాము కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు అని మంత్రి ఈటెల అన్నారు.

Etela Rajender

ఈ రోజు బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రాన్ సంస్థ వంద వెంటిలేటర్స్‌ను మంత్రి ఈటెల రాజేందర్‌కి అందించారు. 80 వెంటిలేటర్స్ గాంధీ ఆసుపత్రి కి, 10 ఒస్మానియా ఆసుపత్రికి, 10 చెస్ట్ హాస్పిటల్‌కు అందించారు. మరో వంద వెంటిలేటర్స్ కూడా అందిస్తామని గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినబాబు తెలిపారు. వీటితో పాటు 5000 పీపీఈ కిట్స్, 5000 ఎన్‌-95 మాస్క్ లు కూడా అందించారు.

ఈ కార్యక్రమంలో మైక్రాన్ డైరెక్టర్ రాధిక, మేనేజర్ మురళి,అమెరికన్ ఇండియా ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రామ్ మెనేజేర్ వినయ్ సనం,గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డా. చినబాబు,కిరణ్,గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాజారావు పాల్గొన్నారు. వీరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

- Advertisement -