కరోనా మొబైల్‌ ఐసీయూను ప్రారంభం:మంత్రి ఈటల

213
Covid-19 Mobile ICU
- Advertisement -

గురువారం కోటీలో డీఎంఈ రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తరపున క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఏర్పాటు చేసిన బసును మంత్రి ఈటల రాజేందర్, మాజీ మంత్రి లక్ష్మా రెడ్డిలు ప్రారంభించారు. బస్‌ను ఈ రోజు ప్రారంభించాం మరో 4 బసులు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ బస్ లో ఎక్స్‌ రే,టెలిమెడిసిన్‌,మెమోగ్రఫీ బాటుగా కరోనా పేషెంట్లకు అవసరం అయిన స్వాబ్ కలెక్షన్ కూడా చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక వేల ఎవరన్నా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వారికి ఆక్సిజన్ ద్వారా చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు.

Corona Mobile ICU

కరోనా సంక్షోభ సమయంలో అనేక మంది దాతలు ముందుకువచ్చి అనేక వైద్య పరికరాలు అందిస్తున్నారు.మైక్రాన్ కంపెనీ 100 వెంటిలేటర్స్ అందించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగంలో 400 వెంటిలేటర్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు మరో వెయ్యి వెంటిలేటర్స్ కొనుగోలు చేస్తున్నామని మంత్రి అన్నారు.

- Advertisement -