- Advertisement -
మార్కెట్ లలో కూరగాయలు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా వైరస్ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ని ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఈసందర్బంగావ్యాపారులను కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు.
మార్కెట్ లో ఉన్న ప్రజలతో మాట్లాడి ధరలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలకు కూరగాయలు అమ్మినా, బ్లాక్ మార్కెట్ కి తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా, కఠిన శిక్ష లు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ తో లాక్ డౌన్ పాటించాలన్నారు. ముఖాలకు మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
- Advertisement -