- Advertisement -
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు జనగాం జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో 18 గురుకుల పాఠశాలలు మంజూరైతే.. కేసీఆర్ 5ఏళ్ళ పాలనలో 119 గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 280 గురుకుల పాఠశాలలు మంజురు అయ్యయి. ప్రతి ఒక్క విద్యార్థికి 1లక్ష 20వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
వచ్చే నెలలో రైతులకు లక్ష రుపాయల రుణ మాఫీ, వృద్దులకు,వితంతువులకు 2016, వికలాంగులకు 3016 పెన్షనులు ఇవ్వబోతున్నాము అన్నారు. 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో sc లకు 134 గురుకుల పాఠశాలలు మంజూరైతే కేసీఆర్ 5ఏళ్ళ పాలనలో 134 గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
- Advertisement -