రాష్ట్ర అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం

323
minister errabelli
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూర్ పట్టణ కేంద్రంలోని 6వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… తొర్రూరు మున్సిపాలిటిని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణాలు అభివృద్దే చెందడమే మంత్రి కేటీఆర్ లక్ష్యం అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటి కౌన్సిలర్లు ముందుండాలి అన్నారు.

10రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ.16లక్షలు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. కౌనిలర్లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో కౌన్సిలర్లు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తోరూరు మున్సీపాలిటీ అభివృద్ధిలో కౌన్సిలర్లతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. తొర్రూర్ మున్సిపాలిటిని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని పిలుపు నిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు రూపురేఖలు మారిపోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -