జనగామను నా సొంత జిల్లాగా చూసుకుంటాః మంత్రి ఎర్రబెల్లి

337
Errabelli Dayakar Rao
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బుద్ది తెచ్చుకోవాలన్నారు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి మంచినీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

దేవాదుల ప్రాజెక్ట్ పై వరంగల్ లో తర్వలోనే రివ్వూ నిర్వహిస్తానని తెలిపారు. వరంగల్ ఎంపీ ఎన్నికలలో రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ సాధించామన్నారు. జనగామ జిల్లాలో అన్ని జెడ్పీటీసీ స్ధానాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేశామన్నారు. తెలంగాణలో ప్రతి ఏకరాకు సాగు నీరు అందించే వరకూ నిద్రపొనని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు పెద్దపీట వేయాలని కేసీఆర్, కేటీఆర్ లు భావిస్తున్నట్లు తెలిపారు. జనగామ జిల్లాను నా సొంత జిల్లాగా చూసుకుంటానని చెప్పారు.

- Advertisement -